Saturday, January 29, 2022

Plots Lands information

 #Useful_Information

ముఖ్యంగా రైతులకు


1) ఒక ఎకరాకు =  40 గుంటలు 

2) ఒక ఎకరాకు =  4840 Syd

3) ఒక ఎకరాకు =  43,560 Sft

4) ఒక గుంటకు =  121  Syd

5) ఒక గుంటకు =  1089 Sft

6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09చదరపు ఫీట్లు 

7) 121 x 09  =  1089  Sft

8) 4840 Syd x 09 = 43,560 Sft

9) ఒక  సెంట్ కు   =  48.4  Syd 

10) ఒక సెంట్ కు  =  435.6  Sft


*#Land servay* కోసం అత్యవసరమైన information...

Common Terminology  in Revenue Department


*#గ్రామ_కంఠం* :

గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.


*#అసైన్డ్‌భూమి* :

 భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.


*#ఆయకట్టు* :

 ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.


*#బంజరు_భూమి* (బంచరామి) :

 గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.


*#అగ్రహారం* :

 పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.


*#దేవళ్‌_ఇనాం* :

 దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.


*#అడంగల్‌* (పహాణీ) :

 గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

Satya Vara Prasad 

*#తరి* : సాగు భూమి


*#ఖుష్కీ* : మెట్ట ప్రాంతం


*#గెట్టు* : పొలం హద్దు


*#కౌల్దార్‌* : భూమిని కౌలుకు తీసకునేవాడు


*#కమతం* : భూమి విస్తీర్ణం


*#ఇలాకా* : ప్రాంతం


*#ఇనాం* : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి


*#బాలోతా ఇనాం*:

 భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి


*#సర్ఫేఖాస్‌* : నిజాం నవాబు సొంత భూమి


*#సీలింగ్‌* : భూ గరిష్ఠ పరిమితి


*#సర్వే నంబర్‌* : భూముల గుర్తింపు కోసం కేటాయించేది


*#నక్షా* : భూముల వివరాలు తెలిపే చిత్రపటం


*#కబ్జాదార్‌* : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి


*#ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)* :

 భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.


*#ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌* :

 దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.


*#బందోబస్తు* :

 వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.


*#బీ మెమో* :

 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.


*#పోరంబోకు* :

 భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.


*#ఫైసల్‌ పట్టీ* :

 బదిలీ రిజిస్టర్‌


*#చౌఫస్లా*:

 ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.


*#డైగ్లాట్‌* :

 తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.


*#విరాసత్‌/ఫౌతి*:

 భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.


*#కాస్తు* :

 సాగు చేయడం


*#మింజుములే*:

 మొత్తం భూమి.


*#మార్ట్‌గేజ్‌* :

 రుణం కోసం భూమిని కుదవపెట్టడం.


*#మోకా* :

 క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).


*#పట్టాదారు_పాస్‌_పుస్తకం* :

 రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.


*#టైటిల్‌_డీడ్‌*:

 భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.


*#ఆర్వోఆర్‌*(రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :

 భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.


*#ఆర్‌ఎస్సార్‌* :

 రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.


*#పర్మినెంట్‌_రిజిస్టర్‌*:

 సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.


*#సేత్వార్‌* :

 రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.


*#సాదాబైనామా* :

 భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.


*#దస్తావేజు* :

 భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.


*#ఎకరం* :

 భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.


*#అబి* :

 వానకాలం పంట


*#ఆబాది* :

 గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు


*#అసైన్‌మెంట్‌* :

 ప్రత్యేకంగాకేటాయంచిన భూమి


*#శిఖం* :

 చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం


*#బేవార్స్‌* :

 హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.


*#దో_ఫసల్‌*:

 రెండు పంటలు పండే భూమిsvp


*#ఫసలీ* :

 జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.


*#నాలా* :

 వ్యవసాయేతర భూమి


*#ఇస్తిఫా_భూమి* :

 పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి


*#ఇనాం_దస్తర్‌దాన్‌* :

 పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి


*#ఖాస్రాపహానీ* :

 ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.


*#గైరాన్‌* :

 సామాజిక పోరంబోకు


*#యేక్‌రార్‌నామా* :

 ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం....!!

Saturday, November 6, 2021

India Education System 1858

 We know only 3 branches when we were growing up, Science, Arts, Commerce. 

In 1978, colleges had five branches. 

Civil, Mechanical, Electrical, Chemical and Electronics. 


But *do you know our Indian schools  were teaching 50-72 different vidyas, before 1858.


The system of Indian schools were destroyed by British Missionaries. 


*The first school in England opened in 1811 . At that time India had 732000 Indian schools.* 


Find out how our schools got closed. How did indian school  learning end.

First will tell you what disciplines were taught in indian culture  !  


Most Indian schools taught the following subjects.


01 Agni Vidya (Metallurgy)

02 Vayu Vidya (Wind)

03 Jal Vidya (Water)

04 Antriksh Vidya (Space Science)

05 Prithvi Vidya (Environment)

06 Surya Vidya (Solar Study)

07 Chandra and Lok Vidya (Lunar Study)

08 Megh Vidya (Weather Forecast)

09 Dhaatu Urja Vidya (Battery energy)

10 Din aur Raat Vidya.

12 Srishti Vidya (Space Research)

13 Khagol Vigyan (Astronomy)

14 Bhugol Vidya (Geography)

15 Kaal Vidya (Time studies)

16 Bhoogarbh Vidya (Geology & Mining)

17 Gemstones and Metals (Gems & Metals)

18 Aakarshan Vidya (Gravity)

19 Prakash Vidya (Energy)

20 Sanchaar Vidya (Communication)

21 Vimaan Vidya (Plane)

22 Jalayan Vidya (Water Vessels)

23 Agneya Astra Vidya (Arms & Ammunition)

24 Jeevavigyaan Vidya (Biology, Zoology, Botany)

25 Yagna Vidya (Material Sic)

* This is the talk of scientific education. Now let's talk about professional and technical disciplines that were covered!*

26 Vyapaar Vidya (Commerce)

27 Krishi Vidya (Agriculture)

28 Pashu Paalan Vidya (Animal Husbandry)

29 Pakshi Paalan (Bird Keeping)

30 Yaan Vidya (Mechanics)

32 Vehicle Designing

33 Ratankar (Gems & Jewellery Designing)

36 Kumhaar vidya (Pottery)

37 Laghu (Metallurgy & Blacksmith)

38 Takkas

39 Rang Vidya (Dyeing)

40 Khatwakar

41 Rajjukar (Logistics)

42 Vaastukaar Vidya (Architecture)

43 Khaana Banane ki Vidya (Cooking)

44 Vaahan Vidya (Driving)

45 Waterways Management

46 Indicators (Data Entry)

47 Gaushala Manager (Animal Husbandry)

48 Baagvaani (Horticulture)

49 Vann Vidya (Forestry)

50 Sahyogee (Covering Paramedics)


All this education was taught in school, but with time, when school disappeared, this knowledge was made to disappear by the British! It started with Macaulay. Today, the future of the youth of our country is being destroyed by the Macaulay method. 


How did school culture end in India?

The introduction of Convent education ruined schools  Indian Education Act was formed in 1835 (revised in 1858). It was drafted by 'Lord Macaulay'. 


Macaulay conducted a survey of education system here while many Britishers had given their reports about India's education system. One of the British officer was G.W. Luther and the other was Thomas Munro! Both of them had surveyed different areas at different times. Luther, who surveyed North India (Uttar Bhaarat), wrote that there is 97 % literacy here and Munro, who surveyed South India (Dakshin Bhaarat), wrote that here there is 100% literacy.


Macaulay had clearly said that if India (Bhaarat) is to be enslaved forever, its ′′*indigenous and cultural education system* ′′ must be completely demolished and replaced with ′′ English education system ′′ and only then will Indians be physically Indians, but  mentally become English.  When they leave the convent schools or English universities, they will work in the interest of British.


Macaulay is using an idiom - ′′ Just as a farm is thoroughly ploughed before a crop is planted, so must it be ploughed and brought in the English education system. ′′ That's why he first declared schools  illegal. Then he declared Sanskrit illegal and set the schools  on fire, beat the teachers in it and put them in jail.

Till 1850 there were ' 7 lakh 32 thousand ' schools  & 7,50,000 villages in India. Meaning almost every village had a school and all these schools used to be 'Higher Learning Institutes' in today's language. 18 subjects were taught in all of them and these people of schools  used to run these together, not by the king.

Education was imparted free.

Schools were abolished and English education was legalized and the first convent school opened in Calcutta. That time it was called 'free school'. Under this law, Calcutta University, Bombay University & Madras  University were created. These three slavery-era universities are still in the country!


Macaulay had written a letter to his father. It is a very famous letter, in it he writes: ′′ These convent schools will bring out children who look like Indians but are English by brain and they don't know anything about their country. They won't know anything about their culture, they won't have any idea about their traditions, they will not know their idioms, when such children are there in this country, even if the British go away, English will not leave this country.′′ The truth of the letter written at that time is clearly visible in our country even today. See the misery created by this  act. We feel inferior of ourselves who are ashamed to speak our own language & recognise our own culture.


A society that is cut off from its mother tongue never flourishes and this was Macaulay’s strategy! Today's youth here knows more about Europe than India. Considers Indian culture not so cool, but imitates Western country.


What a pity. It's high time we all awaken & reclaim our great culture & heritage.


Better to study our great educational system By our Indian schools  were teaching 50-72 different vidyas, before 1858.


Further, better to study in n our mother tongue in order to achieve better quality of education.


We will  keep away the system brought by British Missionaries and destroyed our value based systems which were before British invasion. 


Received and forwarded.

🙏🙏

Tuesday, October 5, 2021

what will you teach your disciples? - JPS

 One devotee in Mayapur once approached HH Jayapataka Swami and asked him, 


*“If you have free time, what will you teach your disciples?”*


 Probably, Prabhu expected him to say that 


*Maharaja would teach deep aspects of Radha Krishna Bhakti and secrets of the Bhagavatam and pastimes of Sri Chaitanya Mahaprabhu*.


 Surprisingly, Maharaja’s answer was very different. He said, 


*“If I have time to teach my disciples, I would teach to respect their parents, elders, friends and Vaishnavas, teach them to help, serve and assist others in their service, teach them to forgive and forget others mistakes, teach them to show love, affection and compassion to their God Brothers and Vaishnavas, teach them to have a big heart to accept everyone without any conditions.”*


Maharaja further continued and said that 


*if you love someone, someone will love you. If you show mercy, someone will be merciful to you. If you judge someone, someone will judge you. If you have trust and faith in someone, someone will have trust and faith in you. If you insult someone, someone will insult you. If you encourage someone to serve Guru and Krishna to their ability, someone will encourage you in this regard. If you harm someone, someone else will harm you too. If you show compassion on the face during another devotees sorrow or fall downs and secretively enjoy his state at heart, someone also will do the same to you.*


Prabhu said that this was all worldly and materialistic aspects. 


Maharaja immediately said that this is the problem with our devotees. 


*We talk high principles of Bhakti and preach extensively about Krishna Consciousness, but fail to realize and imbibe these so-called simple but great human qualities, which are the very foundation of Vaishnava character*.


Maharaja also said the 


*main impediment which retards the growth of a Vaishnava is the envy and ill feelings towards other Vaishnavas who are contributing their mite to serve Guru and Krishna*. 


Prabhu understood the in-depth feelings of Maharaja and thanked him for enlightening him on this very important but most fundamental aspect.


👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

Please accept this sharing of wonderful pastime as a humble service at your lotus feet from your insignificant servant.


Please forgive for any offense and bless me to realize and imbibe this wonderful qualities🙇🏻‍♂️🙏🏻


Your Insignificant Servant 

Bhaktha Santhosh

Tuesday, September 28, 2021

Best Sales Man of the Year

 ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.


అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.

 "ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.


 "చెయ్యలేదు"

 

"సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ".


తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు. 


"ఈ రోజు ఎంత మంది custermurs కి  సేల్స్ చేశావు?".


 "సర్ ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.


 "ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?"


 "8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్. 


"వాట్ !!" అదిరిపడ్డాడు  బాస్. 


"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?"  అడిగాడు. 


"వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను."


"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? "  అన్నాడు బాస్.         


"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.” 


బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!"


 "లేదు సార్ !" బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.


"మరి ? "  అన్నాడు బాస్. 


 " ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను." 


బాస్: " అరే యార్ …!! ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"


అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు "

చైతన్య -నారాయణ, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్ 

ఏబిసిడి లు నేర్పమని వస్తే ,పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ,రాంక్  పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు😃😃😃

Saturday, July 31, 2021

Breathing - శ్వాస విజ్ఞానము

 శ్వాస విజ్ఞానము:-


 శ్వాసతో పుట్టిన మనం, శ్వాస విడిచి వెళ్లిపోయేలోపు అసలా శ్వాసనే గుర్తించకపోవడం, పట్టించుకోకపోవడం ఓ విచిత్రము. అట్టి శ్వాసను మనం గుర్తించకపోయినా, దాని శక్తిని మనం పట్టించుకోకపోయినా -- మనం మనకు తెలియకుండానే దాన్ని మనం ఉపయోగించుకొంటాము.  ఉదాహరణకు, ఏదైనా బరువు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు దాటవలసి వచ్చినప్పుడు కానీ అసంకల్పితంగానే మనం శ్వాసను బిగిస్తాము.  కొన్ని సెకన్లు మాత్రమే జీవించే ప్రాణి నుండి బ్రహ్మం వరకు అందరూ శ్వాసిస్తారు. అలాగే శిలలు, పర్వతాలు, కొండలే కాకుండా ఆకాశం కూడా శ్వాసిస్తుంటుంది. సెకనుకు 18 కి.మీ.ల చొప్పున ఆకాశం వ్యాకోచిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.


❇️ శ్వాస - సోహం:-

మనం శ్వాస తీసుకున్నప్పుడు 'సో' అనే శబ్దం, వదిలేటప్పుడు 'హం' అనే శబ్దం వచ్చును.  'సో'లో 'ఓ' అనే శబ్దం, 'హం'లో 'మ్' అన్న శబ్దం అంతర్లీనంగా ఉన్నది.  ఈ రెండు కలిపి 'ఓం' అవుతుంది. ఓం అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి అనగా ఆదిపరాశక్తి. ఈ వివరణ మనకు తెలియక పోయినా, ఒక్కసారి మనము శ్వాస తీసుకుని వదిలినచో, ఆ ఆదిపరాశక్తి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉండి తీరుతుంది అని ఋషుల వాక్కు.


 శ్వాస ఎంత వరకు లోపలికి తీసుకుంటామో,  అక్కడి నుండే మళ్ళీ వదలిపెడుతున్నాము.  ఈ ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్యన ఉండు బిందువు 'శక్తి' యొక్క స్థానం అని తెలుసుకుని,  ఆ బిందువు మధ్య ఖాళీ జాగాపై దృష్టి ఉంచగలిగితే అదే 'ప్రాణాయామము' అనబడుతుంది.


❇️ శ్వాస - ఆయుష్షు:-

ప్రాణికోటికి భగవంతుడు ఆయుష్షును శ్వాస లెక్కలో ఇవ్వడం జరిగింది. నిమిషానికి ఎక్కువ శ్వాసలు ఖర్చుపెట్టినచో- తక్కువ ఆయుష్షు., మరి నిమిషానికి తక్కువ శ్వాసలు తీసుకున్నచో - ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు.  సాధారణ మానవుడు సాధారణ కాలంలో నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. పరుగెత్తినపుడు, కోపంగా ఉన్నప్పుడు 18-24 సార్లు శ్వాసిస్తాడు.  కామకేళి అనగా మైథున కాలంలో 35 సార్లు అంటే అన్నిటికన్నా ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడతాడు. మనిషి సరాసరిన రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు.

➡️ కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసించి 20 సంవత్సరాలు జీవిస్తుంది.

➡️ కుక్క నిమిషానికి 38 సార్లు శ్వాసించి 13 సంవత్సరాలు జీవిస్తుంది. 

➡️ గుర్రం 19 సార్లు శ్వాసించి 35 సంవత్సరాలు జీవిస్తుంది.

➡️ తాబేలు నిమిషానికి 5 సార్లు శ్వాసించి 200 సంవత్సరాలు జీవిస్తుంది.


❇️ శ్వాస - నాడులు:-

మన శరీరములో 272000 నాడులున్నాయి.  నాడులనగా ప్రాణవాయువు (శ్వాస) యొక్క రాకపోకలకు మార్గములు,  నరములు కావు.  ఈ 272000 నాడులలో 10 నాడులు ప్రధానమైనవి. వీటిని దశ నాడులు అని పిలుస్తారు. అవి..


1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు

2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు

3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు

4. గాంధారి నాడి - కుడి నేత్రం

5. అస్తిని నాడి - ఎడమ నేత్రం

6. పూష నాడి - కుడి చెవి

7. యశస్విని నాడి - ఎడమ చెవి

8. ఆలంబన నాడి - నోరు

9. లకుహా నాడి - శిశ్నము

10. శంభని నాడి - గుదము


మరణం సంభవించినప్పుడు పైన ఉదహరించిన 10 ద్వారాలలో ఏదో ఒక ద్వారం గుండా ప్రాణం బయటకు  పోవును.


 వీటిల్లో అత్యంత ప్రధానమైనది 3 నాడులు. అవి

1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు

2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు

3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు

  మనం తీసుకుంటున్న శ్వాస కుడి ముక్కు ద్వారా ఎక్కువగా బయటకి ప్రవేశిస్తే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమ ముక్కు ద్వారా ఎక్కువగా బయటకు వస్తే చంద్ర నాడి పనిచేస్తుందని తెలుసుకోవలెను. సుషుమ్న నాడి యందు శ్వాస ఆడుతున్నప్పుడు రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస బయటకు వస్తుంటుంది.  ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు శ్వాస మార్చుకుంటున్నప్పుడు కొన్ని సెకన్లు మాత్రమే సుషుమ్న నాడి యందు శ్వాస నడుస్తుంది. ఈ సమయంలో మనం ఏమి ఆశించిన అవి సిద్దించును.

 సూర్యనాడి ఉష్ణ శక్తికి, చంద్రనాడి శీతల శక్తికి ప్రతీకలు. అందువలన శీతల వ్యాధులకు సూర్యనాడి, ఉష్ణ సంబంధిత వ్యాధులకు చంద్రనాడి ఉపయోగకరము. మరి సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఘన పదార్థాలు,  చంద్రనాడి నడుస్తున్నప్పుడు ద్రవపదార్థాలు తీసుకోవడం ఉత్తమం.  కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేదా ఎడమ వైపు తిరిగి పడుకున్నా కుడి శ్వాస ఆడడం ప్రారంభమవుతుంది., అలాగే ఎడమ శ్వాసను నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేక కుడి వైపు తిరిగి పడుకున్నా కొద్దిసేపట్లో ఎడమవైపుకు మారుతుంది.

 స్త్రీ, పురుషులిద్దరూ ఒకే నాడి నడుస్తుండగా సంయోగం చేసినా అసలు గర్భధారణ జరుగదు. పురుషుని యొక్క ఎడమ స్వరం, స్త్రీ యొక్క కుడి స్వరం పని చేస్తుండగా సంయోగం జరిగితే పుత్రికా సంతానం కలుగుతుంది.,  అలాకాకుండా పురుషుని యొక్క కుడి స్వరం, స్త్రీ యొక్క ఎడమ స్వరం పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుంది.


❇️ శ్వాస - పంచప్రాణాలు:-

శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.


1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.


❇️ శ్వాస - చక్రాలు:-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 

➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు

➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు

➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు

➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

➡️ ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు

➡️ సహస్రారము నందు - 1000 సార్లు 

అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.


❇️ శ్వాస - అంగుళాలు:-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.

➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.

   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు.


❇️ శ్వాస - సృష్టి వయస్సు:-

 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన

➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.


❇️ శ్వాస - సాధన:-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.

     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.

     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

Thursday, July 8, 2021

Pothana ammala ganna yamma

 🙏🌺 బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే

ఈ పద్యం గురించి మీకు తెలుసా🌺🙏

🌺అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ* *దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్🌺

🌺విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు *కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి

ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. 

కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.🌺

🌺అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. 

అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు🌺

🌺అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.🌺

🌺సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.🌺

🌺ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.🌺

🌺అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’...మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మల

Sri sri

 *శ్రీశ్రీ చమక్కులు*


శ్రీశ్రీ  గారు, మీరెప్పుడైనా బట్ట తల మీద కవిత్వం రాశారా ? (రాళ్లబండి కుటుంబ రావు) 
లేదండి !! నేనెప్పుడూ కాగితం మీదే రాస్తాను (శ్రీశ్రీ) 

అట్లు చెప్పనా? (హోటల్ లో స్నేహితుడు)
అట్లే కానిమ్ము (శ్రీశ్రీ)

మీరు నాకు ఓ నాటిక రాసి పెట్టాలి (వల్లమ్ నరసింహా రావు)
ఏ నాటికైనా రాస్తాను మిత్రమా (శ్రీశ్రీ)

కొచ్చిన్ సిస్టర్స్ కవర్ పేజీ గా వేద్దామా (పత్రికా సంపాదకుడు)
ఎందుకొచ్చిన సిస్టర్స్ (శ్రీశ్రీ)

చలం గారు రాసిన యోగ్యతా పత్రం చదివితే ఇకే మహా ప్రస్తానం చదవక్కర లేదంటాను, మీరేమంటారు (పిచ్చి రెడ్డి)
మీరు సార్ధక నామధేయులంటాను (శ్రీశ్రీ)

మీ శిష్యరత్నమైన ఆరుద్ర మీద మీ అభిప్రాయం ఏమిటి (విలేఖరి )
నా శిష్యుడంటే అతనొప్పుకోడు. అతగాడు రత్నమంటే నేనొప్పుకోను (శ్రీశ్రీ)

ఇక్కడ వేడి తేనీరు దొరుకును (హోటల్ ముందు బోర్డు)
అరే!! ఇక్కడ వెడితే కానీ నీరు దొరకదా (శ్రీశ్రీ)

కుక్కలున్నవి జాగ్రత్త (ఓ ఇంటి ముందు బోర్డు)
అరే !! ఇంతకు ముందు ఇక్కడ మనుషులు ఉండేవారే (శ్రీశ్రీ)

కవులు హాలికులైతేనేమి అన్నారు పోతన, ఆల్కహాలికులైతే నేమి అంటాడు శ్రీశ్రీ

మీసాలకు రంగేదో వేసేస్తే యవ్వనం లభించదు నిజమే. సీసా లేబిల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే ...సిరిసిరిమువ్వా (శ్రీశ్రీ)

టైంకు రావడం శాస్త్రీయం, టైంకు రాకపోవడం కృష్ణ శాస్త్రీయం (శ్రీశ్రీ)

ఉగ్గేలా త్రాగుబోతుకు, ముగ్గేలా తాజమహల్ మునివాకిట్లో. విగ్గేలా కృష్ణ శాస్త్రి కి, సిగ్గేలా భావ కవికి సిరిసిరి మువ్వా (శ్రీశ్రీ)

మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్, పళ్లూడిన ముదుసలి కుచ్చిళ్ళను సవరించినట్లు సిరిసిరి మువ్వా (శ్రీశ్రీ)

అరిచే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు మొరగవు, కరవక మొరిగే కుక్కలు తరమవు, అరవక కరిచే కుక్కలు మరలవు, అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు (శ్రీశ్రీ)

ఇస్పేటు జాకీలం, ఎగేసిన బాకీలం, మృత్యువు సినిమా లో మూడు బాషల టాకీలం, భగవంతుని టోపీలం, కవిత్రయపు కాపీలం, గోరంతలు కొండంతలం (శ్రీశ్రీ)