Sunday, September 4, 2022

Sri Radha

 🎻🌹🙏ఈ రోజు శ్రీ  రాధాష్టమి సందర్భం గా.....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌷భాగవతంలో పెద్దగా చర్చించని రాధాకృష్ణుల గురించి ఏ పురాణం వివరిస్తుంది..?🌷


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


🌿శ్రీకృష్ణుని అష్టమహిషులు ఉండగా ఎన్నో చోట్ల రాధాకృష్ణుల ఆలయాలు ఉండడం,


🌸 వారి కీర్తనలు బహు ప్రచారంలో ఉండడం, ప్రేమైకస్వరూపంగా వారి గురించి చర్చించడం చూసాము. 


🌿వారి గురించి లోకంలో ఎన్నో దివ్యగాధలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అనవసరమైన తప్పుడుకధలు కూడా చాలా ప్రచారం జరుగుతున్నాయి.


 🌸ఎలాగైతే సూర్యునిగురించి ఎవడో ఏదో తప్పుడు కూతలు కూసినా ఆయన ప్రభావానికి లోటు లేదో, రాధాదేవి గురించి తెలియకపోయినా, తెలివితక్కువ కధలకు విలువ ఇచ్చినా ఆవిడకు వచ్చిన లోటేమీ లేదు.


🌿శ్రీమద్భాగవతం లో చాలా క్లుప్తంగా వివరింపబడిన రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....


🌷1. దేవీభాగవతం :🌷


🌸 నవమ స్కంధంలో గోలోకం గురించి ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి ప్రకృతి పురుషుల రూపంగా ఉన్నారో వివరిస్తుంది. 


🌿రాధాదేవి శ్రీకృష్ణ ప్రాణాధిక, అలాగే శ్రీకృష్ణుడు లేని రాధ లేదు. వారినుండే బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు, ద్విభుజ కృష్ణుని నుండి చతుర్భుజ నారాయణుడు ఎలా ఉద్భావించాడో


🌸 వారినుండి వివిధ బ్రహ్మాండాలు ఎలా విస్తరించాయో, లక్ష్మీ, గంగా, సరస్వతీ, తులసీ ఉద్భవం వంటి వివిధ రోమాంచక ఘట్టాలన్నీ నవమస్కంధం వివరిస్తుంది. 


🌿శ్రీకృష్ణుని శక్తి రాధగా నిలుస్తుంది. రాధాకృష్ణులు వేరు వేరు అని అనుకోవడం వారి మాయకు లోను కావడం. ఆవిడ శ్రీకృష్ణ నిత్యానుపాయిని. 


🌷2. బ్రహ్మవైవర్తన పురాణం: 🌷


🌸ఈ పురాణం సంపూర్ణంగా రాధాకృష్ణుల గురించి చెబుతుంది. బ్రహ్మ, ప్రకృతి, గణేశ, కృష్ణ ఖండాలుగా ఉన్న ఈ పురాణంలో సగభాగం కృష్ణ ఖండం. 


🌿ఈ పురాణం అంతా రాధాదేవి తత్త్వం గురించి, రాధామాధవులను అర్ధనారీశ్వర తత్త్వంలో వివరిస్తుంది. 


🌸ఈ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడే పరబ్రహ్మ, రాధమ్మే పరబ్రహ్మమహిషి. దుర్గ, లక్ష్మి, సరస్వతి ఇత్యాది ప్రకృతి రూపాలన్నీ కూడా రాధ నుండి ఉద్భవించినవే. 


🌿స్త్రీతత్త్వాన్ని ఎవరైనా అవమానిస్తే రాధను అవమానించినట్టు అని చెబుతుంది ఈ పురాణం.


🌸 చైతన్యమహాప్రభు ఇత్యాది భక్తి రస వేదాంతులకు పరమ ఉత్కృష్టమైనది ఈ బ్రహ్మవైవర్తన పురాణం.


🌿 శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణుల రాసలీలలు, వ్రజభూమి లో వారి ఆటపాటలు వంటి ఎన్నో


🌸 శ్రీకృష్ణ మానవావతార ప్రధాన ఘట్టాలన్నీ విపులంగా వివరింపబడ్డాయి.

 అమ్మవారి చైతన్య తత్త్వం గురించి ప్రకృతి ఖండం విస్తారంగా చెబుతుంది. 


🌷3. బ్రహ్మాండ పురాణం:🌷


🌿 ఉపోద్ఘాతపర్వంలో పరశురాముడు గజాననుని దంతం తన పరశువుతో ఖండించినప్పుడు పార్వతి దేవిని శాంతపరచడానికి రాధాసహిత కృష్ణుడు ప్రత్యక్షమై 


🌸తన సహోదరిని ఊరడింప చేస్తాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు వారిని చేసిన స్తోత్రం గృహేరాధే వనే రాధే జగత్ప్రసిద్ధం


🌷4. స్కాందపురాణం: 🌷


🌿వైష్ణవఖండంలో భాగవతమహాత్మ్యం వర్ణనలోను, వాసుదేవ మహాత్మ్యంలోను శ్రీకృష్ణుని ఆత్మ గా రాధమ్మను కీర్తిస్తారు.


🌸 దీనిలోనే గోలోక ప్రాశస్త్యం, నారదునికి రాధాకృష్ణుల దర్శనభాగ్యం వంటి ఎన్నో ఘట్టాలు వివరింపబడి ఉన్నాయి. 


🌷5. నారదపురాణం: 🌷


🌿నారదుడు యుగళ సహస్రనామం చేసినప్పుడు మొదటి 500 నామాలు కృష్ణుని కీర్తిస్తే తదుపరి ఐదు వందల నామాలు రాధా కీర్తన.


🌸 అమ్మవారి తత్త్వం అర్ధం చేసుకోవడం కోసం నారదుడు బృందావనంలో ఒక గోపికగా అవతరించి రాధమ్మ పార్శదునిగా ఆత్మానందం అనుభవిస్తాడు. 


🌷6. పద్మపురాణం: 🌷


🌿భూమిఖండంలో రాధాష్టమి, రాధాదామోదర వ్రతం విశేషాలు విస్తారంగా వివరింపబడి ఉంటాయి.


🌸 పాతాళఖండంలో రాధామాధవుల రాసలీల, వారి పరబ్రహ్మ నిరూపణ, గోలోకంలో వారి లీలలు, నందవ్రజంలో వారు చేసిన అధ్బుత విన్యాసాలు,


🌿 అర్జునుని అభ్యర్ధన మేరకు అర్జునుని అర్జుని అని పేరు గల గోపికగా మార్చి పరబ్రహ్మ ప్రకృతీ పురుషుల దర్శనం ఇవ్వడం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి. 


🌷7. విష్ణుపురాణం : 🌷


🌸13వ సర్గలో రాసలీల వివరణ రాధ యొక్క గొప్పదనం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.


🌷8. గర్గ సంహిత:🌷


 🌿దీనిలో రాధాకృష్ణుల రాసలీలలు, వారి దివ్యప్రబోధాలు, బృందావనంలో వారి ఆటపాటలు,


🌸 అటుపై రాధ విరహవేదన, మరల సిద్ద్దాశ్రమంలో వారి కలయిక వంటి అద్భుత లీలలు వర్ణింపబడి ఉన్నాయి.


🌿ఇవి కాక మత్స్యపురాణం లో బృందావనంలో రాధ ఉన్న అమ్మవారికి నమస్సులు అని స్తోత్రం, 


🌸ఋగ్వేదంలో రాధాసంహితలోను, అథర్వణ వేదంలో రాధాతపనీయ ఉపనిషత్తులో రాధా స్తోత్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. 


🌿ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాధాకృష్ణుల తత్త్వం తెలుసుకునే భాగ్యం కలగదని అప్పటికి కానీ వారికి ఆ లీలలు అనుభవించి


🌸 శ్యామసముద్రంలో (అంటే కృష్ణునిలో అంటే మోక్షం ) కలిసే అవకాశం ఉండదని పురాణం చెబుతుంది.


 🌿అటువంటి ఎంతో ఉత్కృష్టమైన తత్త్వం రాధ తత్త్వం. వారి పాపరాశిని దగ్ధం చేసే అవకాశం వీరి చరితం తెలుసుకోవడం.🌸అదే వారి పాపరాశి పోగుచేసుకునేవాళ్ళు వీరి మీద అనవసరపు పైత్యాన్ని ప్రకటించుకుంటూ తమను తాము అధఃపాతాళానికి తీసుకుపోతూ ఉంటారు...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Saturday, September 3, 2022

Qualities of Shrimati Radharani

 Qualities of Shrimati Radharani


   As explained in Bhakti-rasamrta-sindhu (Nectar of Devotion), Krishna possesses sixty-four transcendental qualities. Shrimati Radharani has twenty-five transcendental qualities, but She can control even Krishna by them. Her transcendental qualities are as follows: 

   1) She is sweetness personified; 

   2) She is a fresh young girl; 

   3) Her eyes are always moving; 

   4) She is always brightly smiling; 

   5) She possesses all auspicious marks on Her body; 

   6) She can agitate Krishna by the flavor of Her person; 

   7) She is expert in the art of singing; 

   8) She can speak very nicely and sweetly; 

   9) She is expert in presenting feminine attractions; 

   10) She is modest and gentle; 

   11) She is always very merciful; 

   12) She is transcendentally cunning; 

   13) She knows how to dress nicely; 

   14) She is always shy; 

   15) She is always respectful; 

   16) She is always patient; 

   17) She is very grave; 

   18) She is enjoyed by Krishna; 

   19) She is always situated on the highest devotional platform; 

   20) She is the abode of love of the residents of Gokula; 

   21) She can give shelter to all kinds of devotees; 

   22) She is always affectionate to superiors and inferiors; 

   23) She is always obliged by the dealings of Her associates, 

   24) She is the greatest amongst Krishna’s girl friends; 

   25) She always keeps Krishna under Her control.

   Krishna means ‘all attractive’, since He attracts every one to Him. But Shrimati Radharani attracts even Krishna. Although Krishna says vedaham samatitani – “I know everything” – He fails to understand Radharani. Krishna is acyuta (inconceivable), but for Him Radharani is inconceivable. Radharani is so great. Krishna thought, “I am full. I am complete in every respect, but still I want to understand Radharani.” This question obliged Krishna to accept the propensities of Radharani to understand Himself. So five hundred years ago Krishna appeared as Chaitanya Mahaprabhu, in the mood of Shrimati Radharani and with Her golden complexion, as His own greatest devotee. Krishna did this to understand the depth of devotion of Shrimati Radharani.

Friday, September 2, 2022

I - Who are You? If not me - నేను లేకపోతే

 *నేను లేకపోతే?*


అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని


కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 

 ఆశ్చర్య చకితుడయ్యాడు. 


'"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను  రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు! 


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 


 


 సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. 


అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 

**మరింత ముందుకు వెళితే 

త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 

తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు


అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు. 

*

హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 


ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు  ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు.


అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.


పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! 

**

అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. 


ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .

అందువల్ల 


* నేను లేకపోతే ఏమవుతుందో* 


అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. 


*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో 

అతి చిన్నవాడను* 


అని   ఎఱుక       కలిగి ఉందాం.

జై శ్రీరామ🙏

Vinayaka Chavithi

 సేకరణ.


దేశం మొత్తం మీద వినాయక చవితి ఖర్చు 

80 వేల కోట్లు అయిందని గగ్గోలుపెడుతున్న 

కొన్ని సంఘాలు ! 

-------------------------'


అదేమరి మా గొప్పతనం. 

ఇప్పటికైనా తెలిసిందా 

హిందువుల పండుగల విలువ!

ఈ పండగ వల్ల వివిధ కులవృత్తులవారికి అందరికీ 

ఈ 80 వేల కోట్ల రూపాయల డబ్బు వారివారి ఇండ్లకు చేరింది. 


వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి, 

వారి సహాయకులైన, 

వారికి, మట్టి అందించే వారికి, 

రంగులు అమ్మేవారికి, రంగులు వేసే వారికి..

మేదర సోదరులు తాటాకు/ వెదురు కర్రలతో వేసే తాత్కాలిక మంటపాలు ద్వారా మరియు 

షామియానా వారు వేసే టెంట్లు ద్వారా 

వారికి వారికి ఉపాధి దొరికింది.


సన్నాయి, బ్యాండ్ మేళం వారికి, లోపల డెకరేషన్ చేసే వారికి, క్లాత్ వర్క్ చేసే టైలర్లకు పని దొరికింది.


పువ్వుల పంటల వారికి, కోసే వారికి, అల్లేవారికి, అమ్మేవాళ్లకి, దండలు కట్టేవారికి... దండలు, పూజకు పూలు, పూల డెకరేషన్ల ద్వారా 

అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి.


ట్రాలీలు, లారీలు, వివిధ బళ్ళు నడిపే వారికి 

విగ్రహాలు మంటపాలకు తేవటానికి,

మరల నిమజ్జనానికి తీసుకు వెళ్ళటానికి

అధిక ధరలు చెల్లింపులు జరుగుతాయి.


దాదాపు ప్రతి మంటపం లో అన్నదానాలు జరుగుతాయి. 

కలిసి భోజనాలు జరుగుతాయి.. 

సమాజంలో సామరస్యత పెరుగుతుంది. 

ప్రతి ఒక్కరూ కడుపునిండా తినగల్గుతారు.. 


వంట మనుషులకు, సహాయకులకు, 

టెంట్ హౌజ్ సామగ్రి వారికి డబ్బులు గిట్టబాటు అవుతుంది.


వివిధ రకాల డెకరేషన్. లైటింగ్, సౌండ్ అందించే 

వారికి మంచి ధర కు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు.


బ్రాహ్మణులకు, పురోహితులకు సంభావన దక్కుతుంది. 

ఇప్పుడైనా వీరికి తగిన పారితోషికం లభిస్తుంది.


కొబ్బరికాయలు, అరటిపండ్లు, పాలవెల్లికి కట్టే పండ్లు, పూజచేసే పత్రి, మామిడాకులు... ఇలా వీటిన్నటినీ

ఈ రోజుల్లో కొనటమే కనుక సన్నకారు రైతులు అందరూ

వారి ఇండ్లకీ కొంత ఈ ధనం చేరింది.


హరికధలు, బుర్రకధలు, నాటకాలు, ప్రవచనాలు,

భరతనాట్యాలు, సంగీత కచేరీలు, ఆర్కెస్ట్రాలు,

ఊరేగింపులలో కోయడాన్సులు, భేతాళ నృత్యాలు, కోలాటాలు,

తీన్మారులు, తాసాలు రామడోళ్లు, నాదస్వర డోలు, షెహనాయిలు,

చివరికి తోలుబొమ్మలాటలు వారితో సహా ప్రతీ కళాకారుడు

ఈ వినాయకచవితి పేరుచెప్పకుని తనకుటుంబంతో కలసి

తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే.


ఆఖరికి కూలి పనికి వెళ్లేవారు కూడా

నాలుగు పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో, 

షెడ్ లకు రాడ్ లు ఎత్తే పనికో,

పైన ఆకులు వేసే, రేకులు వేసే పనికో, పోతే 

నాలుగు డబ్బులొస్తాయని ఎదురుచూసేది

కూడా ఈవినాయకచవితి కోసమే.


నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మంటపాల నుంచే అంటే అతిశయోక్తి కాదు.


ముఖ్యంగా ఆనాడు జాతీయోద్యమం కోసం , ప్రజలలో ఐకమత్యం తీసుకురావటానికి బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశ పెట్టిన నవరాత్రులు నేడు దేశానికి ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అంటే మాకు చాలా గర్వంగా ఉంది. 


నేడు గణేశ నవరాత్రులు కు అనుమతులు తీసుకోవటం అంటే ఆత్మ గౌరవం కల్పించలేని రాజ్యంలో ఉన్నామనే భావన కలుగుతుంది.


ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే ... మనం మాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో 

ఎప్పటికీ ఈ సోకాల్డ్ మేధావులకు అర్ధంకాదు.

మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న లోకహితమైన, లోతైన రహస్యాలు వీరికి ఎన్నటికీ అర్థం కావు.

 

ప్రతి పండుగ మనకు ఒక్కో మేలును కల్గిస్తూ, 

ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. 

ప్రతి ఒక్క కులమూ గొప్పదే .. 

ఏ కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించలేదు. 

*గమనిక:- కులం అంటే వృత్తి.* 


భక్తి పేరుతో వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుధైక కుటుంబం అనే సిద్దాంతం దాగి ఉంది.


అర్థం కాని వారు ఒక ఏడాది పాటు వెయిట్ చేసి, ఒకే ఒక్క పండగ జరుపుకుంటూ ఆర్థిక మాంద్యం బారిన పడే వివిధ దేశాల 

ఆర్థిక విధానాల మీద పరిశోధన చేసి చూస్తే 

ఇక వారు మన పండగల జోలికి రారు. 


చివరిగా ఒకమాట....


మన పండుగలలో ధనం ధర్మబద్దంగా చందాల రూపంలో సేకరించి 

అందరికీ పంచబడుతుంది.


మాకు దోపిడీ చేసి ధనాన్ని పంచే రాబిన్ హుడ్ ల అవసరం పడదు! 


మాకు మేము పని కల్పించుకుని 

సమాజాన్ని బతికించుకుని నిలబెట్టుకునే ధర్మంమాది.


జై భారత్🇮🇳 ఇది ఆచారం,

Monday, April 25, 2022

Sex life

 Sex life is meant only for begetting Krsna conscious children


Another significant point of this verse is that one has to observe the prescribed rules and regulations. As confirmed in Bhagavad-gita, yuktahara-viharasya. When one engages in devotional service in Krsna consciousness, he still has to eat, sleep, defend and mate because these are necessities of the body. But he performs such activities in a regulated way. He has to eat krsna-prasada. He has to sleep according to regulated principles. The principle is to reduce the duration of sleep and to reduce eating, taking only what is needed to keep the body fit. In short, the goal is spiritual advancement, not sense gratification. Similarly, sex life must be reduced. Sex life is meant only for begetting Krsna conscious children. Otherwise, there is no necessity for sex life. Nothing is prohibited, but everything is made yukta, regulated, with the higher purpose always in mind. By following all these rules and regulations of living, one becomes purified, and all misconceptions due to ignorance become nil. It is specifically mentioned here that the causes of material entanglement are completely vanquished.


Srila Prabhupada — SB 3.33.26, purport

Friday, April 22, 2022

Atheism comes from Upanishad 😀

 There are Six Schools of Hindu Philosophy:-


SANKHYA PHILOSOPHY :


Dualistic


Has two entities- Purush (spirit) and Prakriti (nature).


The necessity of God is not felt for epistemological clarity about the interrelationship between the higher self. individual self and surrounding universe.


YOGA PHILOSOPHY :


Does not require belief in God, although such a belief is accepted as help initial stage of control of mind, concentration and meditation.


NYAYA PHILOSOPHY :


States that nothing is acceptable unless it is in accordance with reason and experience (scientific reasons and experiments).


Says “the world is real” and it relies on pramanas (evidences).


VAISHESHIK PHILOSOPHY :


Realistic and objective philosophy of the universe.


MIMANSA (PURVA MIMANSA) :


Lays emphasis on the performance of Yagya (or yajna) for attaining spiritual and worldly benefits.


VEDANTA (UTTARA MIMANSA) :


Monistic


States that the world is unreal (maya).

So it can clearly be seen that Vedas include almost all kinds of belief systems people can have. Here Nyaya and Vaisheshik philosophies are nothing but atheism only (because the existence of God or a supernatural power cannot ever be established through reasons, logic and realistic experiments).


But since Vedas are the “oldest scriptures of Hinduism”, they established Hinduism as a philosophy (a way of life) in which people were allowed to have different kinds of beliefs and they were all accepted as a part of Hinduism. There was also nothing like punishing or hating atheists.


An important Hindu Atheist School of Thought: LOKAYATA SCHOOL OF THOUGHT


Lokayata School of thought believes in the reality of this world and the physical existence of man and other beings on earth and nothing else. Loka means world and Lokayata means the person who is centred upon this world only. Lokayats do not believe in God, heaven or hell. Thus although they are atheists, but a part of Hinduism.


In this sense, one can well be an atheist and a hindu at the same time. Hindu atheists accept Hinduism as a “way of life” than a religion.

Monday, April 11, 2022

Teacher n Teaching

 *_టీచింగ్ అంటే వృత్తి కాదు.... విలువలతో కూడిన జాతి నిర్మాణం.... [ఈ చిన్న కథ విన్నారా....?!]_*

*🌹🙏🌹🙏🌹 🙏 🌹 🙏 🌹*

*ఎండ... చెమట... ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి.... అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు... పలకరించాడు... వంగి, కాళ్లకు మొక్కాడు... మాస్టారూ! బాగున్నారా..?'*

*'సర్, నన్ను గుర్తుపట్టలేదా..?' 'ఎవరు బాబూ నువ్వు..?* *చూపు సరిగ్గా ఆనడం లేదు... గుర్తుపట్టలేక పోతున్నాను' 'సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ ను..'*

*'ఓహ్, నిజమా..? చాలా సంతోషం, నాకు గుర్తు రావడం లేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?*

*అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?' 'నేను టీచరు అయ్యాను మాస్టారూ...*

*'గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?'*

*'అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే నాకు స్పూర్తి తెలుసా..?'*

*'అదేంటి..? అదెలా..?' 'బహుశా మీకు గుర్తుండదు. ఓరోజు జరిగిన సంఘటన, నేను చెబుతాను, వినండి..!*


*“ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ తెచ్చుకున్నాడు...* *దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, చేతులు పీకేస్తున్నయ్, మనసు లాగేస్తోంది...*

*ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి లాఘవంగా దొంగతనం చేశాను...* *కాసేపటికి వాడికి తన వాచీ పోయిందని తెలిసొచ్చింది... లబోదిబో ఏడ్చాడు...*

*టీచరు కంప్లయింట్ చేశాడు... అప్పుడు ఆ క్లాస్ టీచర్ మీరే...*

*ఒరేయ్ పిల్లలూ! ఇది మంచి పని కాదు, ఎవరు వాడి వాచీ తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఎవరినీ ఏమీ శిక్షించను అన్నారు మీరు... నేనేమీ భయపడలేదు, నాకు ఇవ్వాలని లేదు, ఇవ్వడం కోసమా చోరీ చేసింది...* *అందుకే తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా...*

*అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు..? కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్ గా నిలబెట్టారు...* *ప్రతి ఒక్కరి జేబు చెక్ చేస్తానన్నారు... కాకపోతే అందరినీ కళ్లు మూసుకోవాలని చెప్పారు.... జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా హెచ్చరించారు...*


*తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు, తీసుకున్నారు, అడ్డగోలుగా దొరికిపోయాను అనుకున్నాను, కానీ ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు... అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు...*

*అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక... వాచీ దొరికింది, కళ్లు తెరవండి అన్నారు మీరు. ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించనూ లేదు,* *నలుగురిలో నా ఇజ్జత్ పోకుండా మీరు కాపాడారు, అది తరువాత అర్థమైంది... ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర గనక వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో... అలా నన్ను రక్షించారు మీరు...*

*నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్... కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా...* *నా అంతట నేనే మారిపోయేలా చేశారు... ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..?* *ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్...”*


*అప్పుడు ఆ టీచర్ సావధానంగా ఇలా చెప్పాడు... “ఒరేయ్, అందరి జేబులూ చెక్ చేశాను... నీ దగ్గర వాచీ దొరికాక నీ మొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు, నీపట్ల నా ప్రవర్తనలో తేడాకు కారణం కావొచ్చు...*

*అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ళ దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకే తెలియకుండా ఉండటం కోసం.... నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను...”*

*(మంచి ఉపాధ్యాయులందరికీ అంకితం...* 🙏)

Friday, April 8, 2022

The Power of Devotional service

 The Power of Devotional Service to Krishna!

If One Performs even a Little Devotional Service, It Is not Lost

When one begins again, he begins at the point where he has left off.


When I read these following quotes I realised that we may underestimate the power of simple acts of service and devotion, such as paying obeisances, or chanting and dancing during kirtans.  They can seem so insignificant, but they are full of spiritual power.  Encouraging our children to engage in such simple acts of devotional service is also of such immense benefit to their spiritual development!


---------------------

Bhagavān Śrī Kṛṣṇa is present in the temple Deity, and even if a child comes to offer his respects, he is counted as a devotee. A small child may not know anything, but simply by seeing the Deity, chanting and dancing, he is benefited. Temples are meant to give everyone a chance to advance in Kṛṣṇa consciousness one step at a time.

sv-alpam apy asya dharmasya

trāyate mahato bhayāt

“A little advancement on this path can protect one from the most dangerous type of fear.” (Bhagavad-gītā 2.40) Even if we do a little on the path of bhakti, it goes to our account. For instance, if we deposit only two dollars in a savings bank, it is kept in our account, and it will increase with interest. Similarly, if one performs even a little devotional service, it is not lost. One may come and join this Kṛṣṇa consciousness movement, render some service and after a while fall down. However, whatever service has been rendered is to one’s permanent credit. That will never be lost. When one begins again, he begins at the point where he has left off."


"Even by sentiment one comes to Kṛṣṇa consciousness and discharges the regulative duties, chants Hare Kṛṣṇa, his next life is guaranteed as a human being. Even he does it for some time—he is not perfect—still, his next life is guaranteed. But others, there is no such guarantee. Even if he discharges his so-called duties, material duties, there is no guarantee that he'll become a human being."


(Srila Prabhupada Morning Walk, Nairobi, November 2, 1975


"The time one devotes in a Kṛṣṇa consciousness temple cannot be taken away. It is an asset—a plus, not a minus. The duration of life, so far as the body is concerned, may be taken; however one tries to keep it intact, no one can do it. But the spiritual education we receive in Kṛṣṇa consciousness cannot be taken away by the sun. It becomes a solid asset."

(Easy Journey to Other Planets, Chapter 2)


"In a firm relationship with the Lord, the devotee does not give up the Lord's service under any circumstance. As far as the Lord Himself is concerned, if the devotee chooses to leave, the Lord brings him back again, dragging him by the hair."

(Caitanya-caritāmṛta Madhya 15.154, Purport

Sunday, April 3, 2022

Gare and Mahabharatham - తింటే గారెలు తినాలి - వింటే భారతం వినాలి

 *🍀తింటే గారెలు తినాలి🍀*

*వింటే భారతం వినాలి*

అని పెద్దలు ఎందుకు అన్నారు?

*"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్"* - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి.

“ దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు. ”

మహాభారత గాథను *వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి* చేత సర్పయాగం చేయించేటపుడు *జనమేజయ మహారాజుకి చెప్పించగా*, అదే కావ్యాన్ని తరువాత *నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు* చెప్పాడు.

*వింటే భారతం వినాలి తింటే గారెలే(మినప వడలు) తినాలి.*

*మినుము శరీరానికి ఇనుము.*

*భారతం మనసుకు బలము.*


ఇన్ని వంటకాలుండగా *గారెలతోనే ఎందుకు పోల్చారంటే.*

గారెలు మహా వంటకం.

భారతం మహా గ్రంధం.

*గారెలను ఏ కాంబినేషన్ (పచ్చడి) తో ఐనా తినచ్చు. విడిగా నైనా తినచ్చు.*

*అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, రసం, సాంబారు, పెరుగు,చెరుకు పానకం ఇలా దేనితో తిన్నా బావుంటుంది.*


*న్యూడిల్స్ తినాలంటే సాస్ తోనే తినాలి.*

*బిర్యానీ తినాలంటే సెరువా తోనే తినాలి.*

*పూరి ఆలుగడ్డ కూర తోనే తినాలి*


ఇలా *గారెలకు ప్రత్యేకమైనా కాంబినేషన్ అవసరం లేదు.*


*భారత కధ ప్రతీ ఇంటి కధ.*

*ప్రతీ మనిషి వ్యధ, రొద,సొద.*

*ఆపదలనుండి కాపాడే సుపధ*

*ధర్మాన్ని కాపాడే గాథ.*


దీనిలోని భాగాలకు పర్వాలు(చాప్టర్స్18)

అని పిలిచారు

18 భాగాలను మహాభారతం జయగ్రంధం అని పిలిచారు. పెను *చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు.* 18 కణుపులు (పర్వములు) కలిగిన 

పెద్ద చెరకుగడ. 

*మంచి చెరకును ఏ మూల నుండైనా మధ్యలోనుండి, చివరి నుండి ఎలా కొరికినా* నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ *జ్ఞానం పెరుగుతుంది.*


సమయాన్ని బట్టి మరికొన్ని విశేషాలు ప్రస్తావించుకుందాం


Do extra, Dont go with crowd

 Study while others are sleeping 

Decide while others are delaying

Prepare while others are daydreaming 

Begin while others are procrastinating 

Work while others are wishing

Save while others are wasting

Listen while others are talking

Smile while others are frowning

Persist while others are quitting

Last but not the least 


*Chant* while others are prajalping


Hare Krishna Hare Krishna 

Krishna Krishna Hare Hare 

Hare Rama Hare Rama 

Rama Rama Hare Hare 

Birth year in Telugu

 మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.👍

 

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)* శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోది

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళ

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోదన

*(1926,1986,2046)*: అక్షయ


దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి.👍

Thursday, March 31, 2022

How to celebrate Ugadi

 *ఉగాది { యుగాది }*


ఆచరణ విధానం


ఉగాది పర్వాన్ని ఆచరించే విధానాన్ని ‘దర్మసింధు’ అనే గ్రంధం, 


ఐదు విధి విధానాలు నిర్వహిస్తే పూర్తి అవుతుంది, అని చెప్తోంది.


ప్రతీ ఒక్కరూ ఈ ఐదు విధులను చక్కగా నిర్వర్తించాలి, 


అనే ఉద్దేశ్యం తోనే ఉగాదికి కొంచం ముందుగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది.


మీరు తెలుసుకొని, మీకు ముఖ్యం అయిన వాళ్ళకి కూడా, తెలియజేసి, కావలసిన పదార్థాలు, వస్తువులు సమకూర్చుకొని, పర్వదినం చక్కగా శాస్త్రబద్ధంగా చేసుకోండి. 


సనాతనధర్మం ఆచరించండి, హైందవ సంస్కృతిని పరిరక్షించండి. భావి తరాలు కి అందించండి.


ఇక,


ఐదు విధుల గురించి వివరంగా క్రింద పొందు పరుస్తున్నాను.


౧. తైలాభ్యంగనం, 


౨. నూతన సంవత్సరాది స్తోత్రం, { ప్రతీ సంవత్సరం పురుషునకు ఒక శ్లోకం ఉంటుంది}


3. నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), 


౪. ధ్వజారోహణం {పూర్ణకుంభ దానం}, 


౫. పంచాంగ శ్రవణం


ఈ పైన తెలియజేసిన విధులను ప్రతీ ఒక్కరూ చేయాలని,


ఉగాది వ్రత గ్రంధం తెలియజేస్తూఉంది.


౧. తైలాభ్యంగనం


తైలాభ్యంగనం అంటే నువ్వులనూనె తో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. 


ఉగాది వంటి శుభ దినాలలో సూర్యోదయాని కి పూర్వము మాత్రమే, మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటారు అని ఋషుల మాట.


కావున నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేసిన, 


లక్ష్మిదేవి, గంగా మాత అనుగ్రహాన్ని పొందగలుగుతారు.


అభ్యంగం కారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం 


అంటే,


అభ్యంగన స్నానం, అన్ని అవయవాలకు పుష్టి దాయకం అని అర్థం. {శరీర అవయవాలు గట్టి పడతాయి}


ఆరోగ్య రీత్యా, ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగన స్నానం కు విశేష ప్రాధాన్యత ఉన్నది.


౨. నూతన సంవత్సర స్తోత్రం


అభ్యంగ స్నానానంతరం, 


సూర్యునికి, ఆర్ఘ్య, దీప, ధూపాధికాలు, 


పుణ్యకాలానుష్టానం ఆచరించాలి.


తరువాత, మామిడిఆకుల తోరణాలతో, పూల తోరణాలతో, దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని ఉంచాలి.


సంవత్సరాది దేవతను, ఇష్ట దేవతారాధన ను, మరియు పంచాంగాన్ని కూడా ఉంచి, పూజించి, ఉగాది ప్రసాదాన్ని {ఉగాది పచ్చడి} నివేదించాలి.


3. ఉగాది పచ్చడి తినటం


ఉగాది రోజున, ఉగాది పచ్చడి తినడం చాలా ముఖ్యం.


వేప పువ్వులు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, మామిడి పిందెలు, కారం కలిసిన షడ్రుచుల రసాయనాన్నే ఉగాది పచ్చడి అంటాం!


అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ 


అని ధర్మసింధు గ్రంధం చెబుతున్నది. 


ఈ ఉగాది పచ్చడి ని ఇంట్లో అందరూ పరగడుపున { ఖాళీ కడుపుతో } సేవించవలెను. 


ఉగాది పచ్చడి సేవించడం వల్ల, సంవత్సరమంతా సౌఖ్యదాయకం అని ఈ శ్లోకము యొక్క భావం.


షడ్రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి, కేవలం రుచిగా ఉండటమే కాకుండా, ఔషద గుణాలు తో, మరెన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది.


తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం అనే ఆరురుచులు జీవితములో సుఖాలు, కష్టాలు, జీవితంలో అన్ని  అనుభూతులు కి తార్కాణం ప్రతీకాత్మకగా నిలుస్తూ ఉన్నాయి.


సుఖాలకు పొంగి పోవద్దు, 

దుఃఖానికి కృంగి పోవద్దు,

సుఖదుఃఖాలు సమభావం తో స్వీకరించు అనే సందేశాన్ని ఈ పచ్చడి మనకి ఇస్తూ ఉంది.


అంతే కాకుండా, ఈ పచ్చడి తినటం వలన, వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి కూడా చేకూరుతుంది.


4. పూర్ణకుంభ దానం


ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారం గా ఉన్నది. 


ఒక పట్టు వస్త్రాన్ని, 

ఒక వెదురుగడకు పతాకం వలె కట్టి, 

దానిపై కొబ్బరిబొండం తో కలశాన్ని వుంచి, 

ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి,

ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం అంటారు.


యధా శక్తి, రాగి, వెండి, పంచలోహాలు లేదా మట్టితో చేసిన కొత్తకుండ ను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు), సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేయాలి.


పూజించిన కలశానికి, 

ఒక నూతన వస్త్రాన్ని చుట్టి,

కలశంపై, పసుపు కుంకుమ చందనం, పసుపుదారాలతో, 

అలంకరించిన కొబ్బరిబొండం ను ఉంచి పూజించాలి.


పురోహితునకు గాని, గురుతుల్యులకు గానీ, 

పూర్ణకుంభ దానము ఇచ్చి,

వారి ఆశీస్సులు పొందడం వల్ల, 

సంవత్సరం పొడవునా విశేషఫలితం లభిస్తుందని ప్రతీతి.


5. పంచాంగ శ్రవణం


తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే పంచఅంగాల సమన్వితం పంచాంగం. 


ఉగాది నాడు దేవాలయంలో గాని, 

గ్రామ కూడలి ప్రదేశాల్లో గాని, 

పండితుల, సిద్థాంతుల సమక్షంలో,

కందాయఫలాలు స్థూలంగా తెలుసుకోవాలి.


చెప్పిన దాని అనుగుణం గా, సంవత్సరం పొడవునా నడచుకొవాలో,

ఉగాది రోజున మన మనసులలో అంకురార్పణం చేసుకోవాలి.


ఉగాది నాటి పంచాంగశ్రవణం వల్ల,

గంగానదీ స్నానఫలితం లభిస్తుంది.


ఉగాది నాడు పంచాంగశ్రవణం చేసేవారికి,

సూర్యుడు శౌర్యాన్ని, 

చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, 

కుజుడు శుభాన్ని, 

శని ఐశ్వర్యాన్ని, 

రాహువు బాహుబలాన్ని,

కేతువు కులాధిక్యతను, కలుగచేస్తారు అని చెప్పబడినది.


‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత, తిరిగి సృష్టి ప్రార


ంభించు సమయాన్ని, ‘బ్రహ్మ కల్పం’ అంటారు. 


ఇలా ప్రతీ కల్పం లోను మొదట వచ్చే యుగాదిని,

యుగానికి ఆదిగా, 

ప్రారంభ సమయమును,

ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. 


ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభము అవడం వల్ల,


ఆ రోజు నుండి మన తెలుగుసంవత్సర ఆరంభదినంగా పరిగణించి, 


లెక్కించుటకు వీలుగా ఉండేందుకే, ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. 


లక్ష్మీ ప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. 


జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ఆ కాలాన్ని నిర్వచించేది పంచాంగ శ్రవణం, 


ముఖ్యంగా, ఉగాది సమయం లో ఇవన్నీ వినటం దేనికి? అనే అనుమానం కలుగుతుంది మనకి,


మనకి అందరి జీవులకు, కాల స్వరూపము రాబోయే సంవత్సరం, అందులో


గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ఆయనాలు, నివసిస్తున్నాయి.


దేనిలో ఏమిటి చేయవచ్చు, ఏది చేయకూడదు, అనే విషయాలు మనం తెలుసుకొని, మన యొక్క జీవితంలో ఆచరణ లోనికి తీసుకొని వచ్చే కార్యక్రమాల ఆలోచనలు చేయవచ్చు. 


ఆవిధంగా ప్రవర్తించినట్లు అయితే, రాబోయే కొత్తసంవత్సరం కి పూలబాట దైవసన్నిధిలో {ఇక్కడ కాల స్వరూపము దైవం} ఏర్పరచుకున్నట్లూ కూడా అవుతుంది.


మన జీవితం సాఫీగా జరగడానికి, ఆలోచించు కోవడానికి, మన ఋషులు ఏర్పరచిన బంగారుబాట పంచాంగశ్రవణం.


అన్ని తెలుసుకోండి, ఒకటికి పదిసార్లు చదివి ధర్మాన్ని ఆచరించండి. 


ధర్మమే మనలను కాపాడుతుంది.


ముందుగా అందరికీ కూడా ఉగాది మీకు చక్కని ఆరభం కావాలి అని ఆశిస్తూ....


*హరిహరాయ నమః*


🕉🕉🕉🕉🕉🕉

 *తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు* Telugu Year Names n Meanings

 *తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు*


1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.

4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.

7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.

8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.

10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర... పరమేశ్వరుడు.

12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.

13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.

14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.

15. వృష ... చర్మం.

16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.

17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం

18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.

19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.

21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.

22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.

23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.

24. వికృతి... వికృతమైనటువంటిది.

25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.

26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.

27. విజయ... విశేషమైన జయం కలిగినది.

28. జయ.... జయాన్ని కలిగించేది. 

29. మన్మథ... మనస్సును మధించేది.

30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి... సాగదీయడం.

33. వికారి.... వికారం కలిగినది.

34. శార్వరి... రాత్రి.

35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.

36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్... శోభను కలిగించేది.

38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ ... అవమానం.

41. ప్లవంగ... కోతి, కప్ప.

42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య... మృదుత్వం.

44. సాధారణ... సామాన్యం.

45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.

46. పరీధావి... భయకారకం.

47. ప్రమాదీచ... ప్రమాద కారకం.

48. ఆనంద... ఆనందమయం.

49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.

51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.

52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.

53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి... దుష్ట బుద్ధి.

56. దుందుభి ... వరుణుడు.

57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన... కోప స్వభావం కలది.

60. అక్షయ... నశించనిది

Tuesday, March 29, 2022

How do we become sick?

 How do we become sick?


I had a question in my mind about sickness and how we become sick. Do we become sick from karma? Do we become sick from our mind? Do we become sick from uncleanliness? How does sickness come upon us? I hadn’t been able to form it into a question that I could actually ask Srila Prabhupada, and as Srila Prabhupada and I were walking along the big main street, Prabhupada stopped, turned to me and said, “Ninety per cent of all sickness is caused by the mind.”


Told by Sivananda Das (edited). Recorded in Memories of a Modern Day Saint Vol. 5 by Siddhanta das.

Always be feaful

 Always be feaful


I am very glad to learn that you are doing spiritual activities very nicely and you are always alert to see whether you are committing some offense. This is a very nice attitude. In rendering service to Lord Krsna and His representative the Spiritual Master, we should always maintain this fearful attitude which means careful attention. This attitude will advance you progressively in Krishna Consciousness.


From Srila Prabhupada’s letter to Gopala Krsna — Los Angeles 21 April, 1970

Two frogs see proof of God

 Two frogs see proof of God


Prabhupada’s eyes were closed as he leaned back in a relaxed position, and he started speaking about Mayavada philosophy. He explained how philosophers were saying, “I am God, you are God, we are all God.” Then Prabhupada would say, “This is going on.” Every time he would state something that was false or erroneous, he would then say, “This is going on.” Eventually he got to the story about two frogs who had heard that there was a God, and they wanted to see proof of God.


There was a stick nearby and they started jumping up and down on the stick, and they said, “This is not God, it doesn’t even respond.”


Then they jumped up on a stone, and the stone also didn’t respond, so they said, “How can this be God?” Then a crane appeared.


At this point in the story Prabhupada started acting out the part of the crane, using his arm as the long legs of the bird and his hand represented the bird’s long neck and head.


Prabhupada’s eyes got really big and with a hilarious expression on his face, he made a gesture with his hand, looking around at both frogs he said, “Then the crane ate one frog and then he ate the other frog.” I was sitting there cross-legged along with Aravinda and Shyamasundar, all of us listening very intently at what appeared to be a very serious philosophical

discussion.


Then when Prabhupada made the gesture with his hand eating the frogs, it was so funny that I rolled over backwards with my legs up in the air laughing uncontrollably.


Prabhupada was also laughing but he was laughing at me along with my two god-brothers.


Told by Locananda Das (edited). Recorded in Memories of a Modern Day Saint Vol. 5 by Siddhanta das.

HDG on Child care

 Some of Srila Prabhupada’s instructions on childcare


(As given to Kisori Dasi. Reference-Memories of a Modern Day Saint Vol. 5 by Siddhanta das)


Srila Prabhupada told me so many things about how to treat children. Vedic ways, Vaisnava ways to treat children, which is totally opposite of our culture. A child should never be left to cry. Immediately pick him up.


Never to say “No” to a child. Then he will feel very confident later.


After bathing a baby, wrap him firmly and fully in cloth up to the neck, including the arms. Then he will sleep very well. For babies, plenty of sleep is needed as much as food and drink so that they can grow properly.


If a child has something in his hand that you don’t want him to have and you want to take it away, the way that he will not cry and not act contrarily, is that in the other hand you show him something and you give him. So then you will easily take that thing. He will drop it by himself and forget about it.


Academics should never be given to a child before seven years old. Otherwise he will be damaged and later his brain will not be properly fit.


He should play a lot.


If a boy is very intelligent, he can be very naughty. It’s also a sign of

intelligence.


Children should have toys, should have cars. Then he was telling about the story of his guns. He said, “If he has toys to play with, then later he will not have so much desire for big cars, and all this.”


About boys, Srila Prabhupada said, “A mother should feed as long as she can.” He gave the example that Krsna was being fed by His mother up to seven years old.


He said, “If a boy takes milk from the breast of his mother for a long time,

then later he will not be so attracted to the breasts of women.”


After birth, for one month only see very close family. Only the father can take the baby. Even other family members cannot. And never go out before minimum one month, so that they don’t get bacteria and all that from outside. No one should touch the baby.


Never give newborns yogurt, because it is very cold.


If you are cooking, even for the Deities, and the child is coming in the kitchen, and he wants to grab something — he is hungry — you have to give him immediately, even if it’s not offered.


Very important feeding the child. And, “Never, never beat him.”


If girls cry in the house, Laksmi will leave.


Girls should never be married to a man to whom she is not at all attracted. This is a big crime.

Tuesday, March 15, 2022

పరనిందా - మహా పాపం para Ninda - Mahaa Paapam

 ఒక రాజ్యంలో   రాజుగారు   చాలా  మంచి వాడు . ఆయన  ప్రతి  రోజూ  తన రాజ్యం గుండా వెళ్లే పేద  బాటసారులకు  ప్రత్యేక సత్రం కట్టించి మద్యాహ్న  భోజనం  వండించి   పెట్టేవాడు  . 

ఒక  రోజు  యధావిధిగా   భోజనం   వండించే  ఏర్పాట్లు  చేస్తున్నాడు  .  అదే  సమయం  లో   ఆకాశం  లో  ఎగురుతున్న  ఒక  గద్ద  కాళ్ళతో  పట్టుకున్న  పాము  నోటినుండి  విషం....  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న   అన్నం  బేసిన్  లో  పడింది  .  అది  ఎవరూ  గమనించలేదు 

ఆభాగం  ఒక  బాటసారి  తిన్నాడు .  అది   తినడం  వలన    అతడు  చనిపోయాడు .  ఈ  వార్త  రాజుగారికి  చేరింది   .   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు .


*ఇప్పుడు  బాటసారి  చనిపోవడానికి   కారణం  ఎవరు ?*


ఆ రాజా ?   వంటవాడా ?    పామా ?  గద్దా  ? వడ్డించిన  వ్యక్తా ? 


రాజు చేసేది ధర్మ కార్యం

అతనిది తప్పులేదు.


గ్రద్దకు పాము ఆహారం

దాని తప్పు లేదు.


 పాముది మరణ బాధ  

కొట్టుకుంటోంది, దాని తప్పులేదు


వడ్డించే వాడికి విషయం తెలీదు, అతని పని అతను చేస్తున్నాడు ,అతని తప్పూ లేదు. 


 మరి ఈ  పాపాన్ని  ఎవరి  ఖాతాలో  వెయ్యాలి ? 


వీరిలో  ఎవరూ   కావాలని  ఆ  బాటసారి ని   చంపలేదు .


యమ ధర్మరాజును  చిత్ర గుప్తుడు అడిగాడు. 


యమధర్మరాజు కు ఏమి చెప్పాలో అర్థం కాక అది అలా ఉంచు బాగా ఆలోచించి చెపుతాను అన్నాడు.

 

ఇది  ఇలా  ఉంటే  కొన్ని రోజుల తర్వాత    దారినే  పోతున్న  బాటసారులు  కొందరు   రాజుగారు  బాటసారుల కు అన్నదానం    చేసే సత్రం  ఎక్కడో  చెప్పమని  ఒక  వనితను  చిరునామా  అడిగారు . 


ఆమె  వారికి  దారిని  చూపుతూ  

“  బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి బాటసారులు  అంటే   పడదు ,  కొద్ది రోజుల క్రితమే  ఒకాయనను  విషం  పెట్టి  చంపేశారు”     మీ  రోజులు  బాగున్నాయో   లేదో  ?   చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అంది  .


వెంటనే యమధర్మరాజు  

“ చిత్రగుప్తా !    మొత్తం  పాపం  అంతా  ఈమె   ఖాతాలో  వెయ్యి అన్నాడు.


 సదుద్దేశ్యంతో  ధర్మ కార్యాలను చేసేటప్పుడు

యాదృచ్చికంగా    జరిగే   పనులకు , తప్పు ఎవరిదో తెలీకుండా నిందలను ఆపాదిస్తూ,  వ్యక్తులను  నిందించే  వారికే   ఆ  మొత్తం  కర్మ  ఫలం  కలుగుతుంది  అని  ధర్మరాజు .”  అన్నారు.

 

*కాబట్టి  విషయం సవివరంగా తెలియనప్పుడు ఎవరిమీద  మనం  నిందారోపణలు చేస్తే ఆపాపం మనకే వస్తుంది.తస్మాత్ జాగ్రత్త*🙏🏻.

Thursday, March 10, 2022

Think Positive

 Think positive👍😊


ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ పై తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై  అతని ముందున్న రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి వుంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది..


అందులో ఇలా వుంది


గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది


ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను...ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఇక ఋణం తీరిపోయింది 


ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది


ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది


దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!


చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది. కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడేపెట్టి వెళ్ళిపోయింది.


ఆయనకి మెలుకువ వచ్చింది.  తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద తను రాసింది కాకుండా ఇంకేదో రాసి వుండటం గమనించి చదవడం ప్రారంభించాడు


అందులో ఇలావుంది


గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి నుంచి శాశ్వతంగా ఉపశమనం లభించింది


ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని నా కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా  గడుపుతాను


ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే  ప్రశాంతంగా సహజమరణం చెందారు


ఈ ఏడాది నా కొడుక్కి పునర్జన్మనిచ్చింది. కారు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైనా నా కొడుకు ప్రాణాలతో బైటపడ్డాడు, కార్ కి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో మరో కొత్త కారు కొనుక్కున్నాను


హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"


అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు....


ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.


చాలావరకూ సమస్యలు మన ఆలోచనా దృక్పథం నుంచి ఉద్భవించేవే.. మన ఆలోచనా దృక్పథం #పాజిటివ్ గా ఉంటే ఎంతటి సమస్య ఐనా దూదిపింజెలా తేలికైపోతుంది,ఫలితం అనుకూలంగా ఉంటుంది. కానీ #నెగటివ్ ఆలోచనలు చిన్న సమస్యను కూడా బూతద్దంలో చూపించి మనశ్శాంతిని దూరం చేస్తాయి.


ఆనందమయమైన జీవితం కోసం #పాజిటివ్ గా ఆలోచించడం అలవర్చుకోండి..........✍️🙏

Monday, March 7, 2022

Pig analogy

 ఒక వ్యక్తి తన పందితో పడవలో ప్రయాణిస్తున్నాడు.


ఆ పడవలో ఇతర ప్రయాణీకులతో పాటు ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు.


పంది ఇంతకు ముందు పడవలో ఎప్పుడూ ప్రయాణించలేదు, కాబట్టి దానికి ఆ ప్రయాణం సుఖంగా లేదు. అందువల్ల అది ఎవరినీ శాంతంగా కూర్చోనివ్వకుండా అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది పెడుతోంది.


దీనితో బోట్ నడిపేవాడు ఇబ్బంది పడుతున్నాడు.  ఈ పంది వల్ల ,ప్రయాణికుల భయం కారణంగా పడవ మునిగిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నాడు.


పంది కానీ శాంతించకపోతే అది పడవని 

మునిగిపోయే ప్రమాదంలోకి నెట్టేస్తుంది.


ఆ పందిని తెచ్చిన మనిషి పడవలో ఉన్న ఈ పరిస్థితి గురించి కలత చెందుతున్నాడు.  కాని తన పందిని శాంతింపచేయడానికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.


వాళ్లలో ఉన్న తత్వవేత్త ఇవన్నీ చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.


 "మీరు అనుమతిస్తే, నేను ఈ పందిని ఇంటి పిల్లిలా నిశ్శబ్దంగా చేయగలను." అని ఆ పంది యజమానితో ఆ తత్వవేత్త చెప్పాడు. 


ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు.


తత్వవేత్త, ఇద్దరు ప్రయాణీకుల సహాయంతో పందిని ఎత్తుకొని నదిలోకి విసిరాడు.


ఆ పంది నీటిలో తేలుతూ ఉండటానికి ఈత కొట్టడం ప్రారంభించింది. దానికి ఇప్పుడు ఈత కొట్టకపోతే చచ్చిపోతాను అని తెలిసి దాని ప్రాణం నిలుపుకోవడం కోసం కష్టపడడం మొదలుపెట్టింది.


కొంత సమయం తరువాత, తత్వవేత్త పందిని తిరిగి పడవలోకి లాగాడు.


పంది వెళ్లి పడవలో ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుంది.


పంది యొక్క మారిన ప్రవర్తనను చూసి దాని యజమాని మరియు ఇతర ప్రయాణీకులందరూ ఆశ్చర్యపోయారు.


ఆ వ్యక్తి తత్వవేత్తను అడిగాడు: "మొదట అది అటూ ఇటూ దూకుతోంది. ఇప్పుడు అది పెంపుడు పిల్లిలా కూర్చుంది. ఎందుకు? కారణం ఏమిటి అని అడిగాడు.


తత్వవేత్త ఇలా అన్నాడు: "అదే తరహా ఇబ్బందిని అనుభవించకుండా మరొకరి కష్టాన్ని ఎవరూ సరిగా అర్ధం చేసుకోలేరు. నేను ఈ పందిని నీటిలోకి విసిరినప్పుడు, అది నీటిలో పడితే  ప్రమాదాన్ని మరియు పడవ యొక్క ఉపయోగాన్ని అది అర్థం చేసుకుంది."


 *భారతదేశంలో అలాగే దేశం బాగోలేదు, వాక్ స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ప్రభుత్వం బాగా నడపడం లేదు అంటూ అటూ ఇటూ దూకుతున్న పందులను ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా,ఇరాన్, ఇరాక్ లేదా పాకిస్తాన్ లేదా చైనాలో 6 నెలలు విసిరివేయాలి. తరువాత వారు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఆటోమాటిక్ గా పెంపుడు పిల్లిలా ప్రశాంతంగా జీవించడం నేర్చుకొని ఒక మూల కూర్చొని వుంటారు* .

Tuesday, February 22, 2022

Edu Chepala katha

 శ్రీమతే రామానుజాయ నమః 🙏

శ్రీమతే నారాయణాయ నమః🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*ఏడు చేపల కథకు ఆధ్యాత్మిక వివరణ తెలుసుకుందాం.*

☘☘☘☘☘☘☘☘

*రాజుగారు అంటే మనిషి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ  5.మద 6.మాత్సర్యాలు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అందుకే కథలో ఆరు  చేపలను  ఎండగట్టినట్టు చెప్పారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఏమిటా చేప. అది మనస్సు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*దీన్ని జయించడం చాలా కష్టం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఎంత ప్రయత్నించినా అది ఎండదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనస్సు  అంటే ఏమిటి*❓

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనస్సు అంటే సంకల్ప వికల్పాలు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*గడ్డిమేటు అంటే ఏమిటి?*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కుప్పపోసిన అజ్ఞానం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా?*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మరి అది పోవాలంటే ఏం చేయాలి❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆవు వచ్చి మేయాలి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆవు అంటే జ్ఞానం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ఈ గోవును ఎవ్వరు మేపాలి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు . శ్రీకృష్ణపరమాత్మ.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓*

🌸🌸🌸🌸🌸🌸🌸

*అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది. మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన  తన విధిని నిలిపి వేసాడా.లేదు.అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు 

ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.


*🕉️ఓం నమో🙏భగవతే వాసుదేవాయ*

*🕉️సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏*

Monday, January 31, 2022

Harsh Treatment of others - Spiritual Revelation

 If someone is treating us harshly that should remind us... - Spiritual_revelations


Question: You have told us that Prabhupada said that one of the three things we can pray for unconditionally is friendship with devotees. What is the value of that friendship if those people hurt and disappoint us? Then also when the time of death comes, guru and Krsna are our only shelter, we cannot have any other attachments even to friends isn’t it?


Jayapataka Swami: I don’t know that I said that these are the only three things you can pray for, and one of them is having devotee friends. We should be friendly and respectful to devotees. We shouldn’t commit offences to devotees because those offences are like mad elephants, they can ruin our devotional garden. So Lord Caitanya told us we should offer respect to others and don’t expect any respect for ourselves. So it seems like you are expecting that your so called devotee friends will gratify your ego and if they don’t do that, you reject them. This is what Lord Caitanya advises us we should not do. We should offer respect to everybody – amani mana dena-but we should not expect any respect for ourselves and then you will never be let down. Ha! So some people don’t like me in devotional service, they criticize me and so on, but I don’t feel bad about them, I don’t get preoccupied; rather I wish them all success in their spiritual life. So I want to please guru and Krsna and their opinion is what is important to me. Someone may like or may not like me, but I wish well for everybody. So Lord Nityananda, He was hit on the head by Madai, blood was flowing. He said that ‘just because you have caused Me to bleed, does that mean I won’t give you love of Godhead?’ So what to speak of someone who makes some unfavorable comments on us. Nitai was hit on the head and bleeding and still He gave love of Godhead! He pleaded for Madai! Such is the mercy of Lord Nitai Gaur. If someone is treating us harshly, that is to remind us that this material world is not a good place to stay so we thank them. If everybody was nice to us, then we may think that this material world was a nice world. Thank you for giving us firsthand understanding that this world stinks! and we want to be in a place of pure love of Krsna. Now most devotees should be on that platform. Srila Prabhupada said that Krsna consciousness is like a hospital. In a hospital you have doctors, nurses and sick people, lot of sick patients. In the Krsna consciousness movement some people are sick and they are treated by doctors and nurses. So we don’t expect everybody to be healthy and some people are still sick. And the guru is like a doctor, senior devotees are like doctors, interns, and they are all working to deliver people. Some people will be of very good association, so we should try to take that association. Some people may not be of such good association, so we are friendly, but we may not associate with them.


19-JULY-2019 CHENNAI, INDIA

Saturday, January 29, 2022

Srila Prabhupada Introduction in Telugu

 *పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఏ.సి. భక్తివేదాంత స్వామి*

*ప్రభుపాదుల పరిచయము*

-------------------------------------------

పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు భారతదేశములోని కలకత్తా నగరములో 1896 వ, సంవత్సరములో జన్మించారు. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి వారిని కలకత్తాలో 1922 వ, సం.లో మొదటిసారి కలుసుకున్నారు. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతుల వారు ప్రముఖ వైదిక విద్యాసంపన్నులు, 64 గౌడీయ మఠాలను (వైదిక సంస్థలు) స్థాపించారు. వారు విధ్యాసంపన్నులు, యువకులైన ప్రభుపాదుల వారిని చూచి మిక్కిలి సంతోషించి, వైదిక విజ్ఞానాన్ని బోధించడానికి తమ జీవితాన్ని అంకితము చేయుమని ఉపదేశించారు. ఆనాటి నుండి శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరు వారికి శిష్యులై పదకొండు సంవత్సరాల తరువాత యథావిధిగా దీక్షను తీసుకున్నారు.


మొదటి సమావేశములోనే శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరు గారు ఆంగ్ల భాష ద్వారా వైదిక విజ్ఞానాన్ని ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరారు. తరువాత సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యమును రచించి, గౌడీయమఠ కార్యక్రమాలకు తోడ్పడ్డారు. 1944లో ‘బ్యాక్ టు గాడ్హెడ్’(భగవద్దర్శనం) అనే ఆంగ్లపక్ష పత్రికను స్థాపించారు. అది ఇప్పుడు పాశ్చాత్యదేశాలలో వారి శిష్యులు చేత ముప్పయి కంటె ఎక్కువ భాషలలో కొనసాగించబడుతుంది.


శ్రీల ప్రభుపాదుల వారి భక్తివిజ్ఞానాలను గుర్తించి 1947లో గౌడీయ వైష్ణవ సంఘం వారికి భక్తివేదాంత బిరుదమును ఇచ్చి గౌరవించింది. 1950లో 54 సంవత్సరాల వయస్సులో ప్రభుపాదుల వారు వైవాహిక జీవితాన్ని విడిచి పెట్టి ఎక్కువకాలము గ్రంథాలను చదవడానికీ, వినియోగించ సాగారు. తరువాత వారు వృందావనానికి వెళ్ళి అక్కడ మధ్యయుగంలో చరిత్ర ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ రాధా దామోదర మందిరములో అతి నిరాడంబర జీవితమును గడిపారు. అక్కడే వారు చాలా సంవత్సరాల పాటు ఉండి ఎంతో విద్యా వ్యాసంగం చేసి అనేక గ్రంథాలను రచించారు. 1959 లో సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించారు. తమ జీవిత ముఖ్య రచన అయిన శ్రీమద్భాగవతములోని 18,000 శ్లోకాలకు అనువాదము, వ్యాఖ్యానాలతో కూడిన అనేకసంపుటాలుగా రచనను ప్రారంభించారు. గ్రహాంతర సులభయానం అనే మరో గ్రంథాన్ని కూడా రచించారు.


శ్రీమద్భాగవతము మూడు సంపుటాలుగా ప్రచురించాక ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరవేర్చడానికి 1965 లో అమెరికా సంయుక్తరాష్ట్రాలకు వెళ్ళారు. అప్పటి నుండీ వారు భారతీయ వేదాంత గ్రంథాలపై ప్రామాణికాలైన వ్యాఖ్యానాలు, భాషాంతరీకారణాలు, సంగ్రహ వ్యాఖ్యలు 70 సంపుటాలకు పైగా రచించారు.


1965 లో మొట్టమొదటిసారిగా ఒక వాణిజ్యనౌకలో న్యూయార్కు నగరానికి వెళ్ళినప్పుడు వారిదగ్గర ఒక్కపైస కూడ లేదు. తరువాత ఒక సంవత్సరానికి అంటే 1966 జూలైలో వారు అతికష్టము మీద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని (ఇస్కాన్) స్థాపించగలిగారు. పది సంవత్సరాల లోపలే ఆ సమాజము బాగా అభివృద్ధి చెంది ప్రపంచమంతట వ్యాపించ సాగింది. పాఠశాలలు, మందిరాలను, ఆశ్రమాలు మొదలైన వాటిని నెలకొల్పసాగింది.


1968 లో శ్రీల ప్రభుపాదుల వారు న్యూవర్జీనియాలోని కొండల పైన ఆధ్యాత్మిక సమాజాన్ని స్థాపించి దానికి నూతన వృందావనము అని పేరును పెట్టారు. అక్కడే ఒక వైదిక పాఠశాలను నెలకొల్పి పాశ్చాత్యదేశాలకు సైతము వైదిక గురుకుల విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ నూతన వృందావనము ఇప్పుడు వేయి ఎకరాలకు పైగా వైశాల్యము గల ప్రదేశములో విరాజిల్లుతుంది. అమెరికాలోని వారి శిష్యులు అలాంటి సంఘాలను ఎన్నింటినో స్థాపించారు.


1972 లో పరమపూజ్యశ్రీ శ్రీమత్ ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలలోని డెల్లాస్, టెక్సాస్లలో వైదిక పద్ధతిలో గురుకులాలను ఏర్పాటు చేశారు. 1972 లో ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన గురుకులము 1975 నాటికి 150 మంది విద్యార్థులతో విరాజిల్లింది.


శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశములో అంతర్జాతీయ కేంద్రాలను నిర్మింప చేయడానికి ప్రోత్సహించారు. పశ్చమ బెంగాలులోని మాయాపూరులో శ్రీధామమనే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించ తలపెట్టారు. అతివిస్తృతమైన ఆ పథక నిర్మాణానికి చాలాకాలము పట్టవచ్చును. అది వైదిక శాస్త్రపఠనానికి కూడ అనుకూలముగా నిర్మించబడింది. భారతదేశములోని వృందావనములో మహోన్నతమైన కృష్ణబలరామ మందిరము ఆ పద్ధతుల ప్రకారమే నిర్మించబడింది. అక్కడ ఒక అంతర్జాతీయ అతిథి గృహము కూడ నిర్మించబడింది. పాశ్చాత్యులక్కడ నుండి వైదిక సంస్కృతిని స్వయంగా నేర్చుకునే అవకాశము ఉంది. బొంబాయిలో ప్రధాన సాంస్కృతిక విద్యాకేంద్రము కూడ గలదు. భారతదేశములో సుమారు పద్దెనిమిది ముఖ్యస్థానాలలో ఇతర కేంద్రాల నిర్మాణము కొనసాగుతుంది.


శ్రీల ప్రభుపాదుల వారి ముఖ్యాతి ముఖ్యమైన సేవ గ్రంథరచన. దాని ద్వారా వారు ఎంతో ప్రసిద్ధిని పొందారు. వారి గ్రంథాలు ప్రామాణికత్వానికీ, జ్ఞాన గాంభీర్యానికీ, వైదుష్యానికి పెట్టింది పేరు. అవి విద్వాంసుల చేత ఎంతగానో గౌరవించబడ్డాయి. అనేక కళాశాలల్లో, పాఠశాలల్లో ప్రామాణిక పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడ్డాయి. వారి రచనలు ఎవభైకి పైగా భాషలలోకి అనువదించబడ్డాయి. ప్రభుపాదుల వారి గ్రంథాలను ముద్రించి, ప్రకటించడము కోసమే 1972 లో భక్తివేదాంత బుక్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించారు. అది ఇప్పుడు భారతీయ వైదికతత్త్వ విషయాలపై గ్రంథాలను ప్రచురించే ప్రపంచ ప్రముఖ ప్రచురణ సంస్థగా రూపొందింది.


వార్ధక్యము సమీపించినను షుమారు పన్నెండు సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా పదునాలుగుసార్లు ఉపన్యాస యాత్ర సాగిస్తూ ఆరుఖండాలలో పర్యటించారు. అంతటి నిర్విరామ కార్యక్రమాలలో నిమగ్నులై యున్నప్పటికీ వారు తమ గ్రంథరచనను కొనసాగిస్తూనే ఉండేవారు. వారి గ్రంథాలన్నింటిని కలిపితే ఒక ప్రఖ్యాత వైదిక వేదాంత సాహిత్య సంస్కృతీ గ్రంథాలయ మవుతుంది.


1977 నవంబరు 14 వ తేదీన వారు ఉత్తరప్రదేశ్ లోని వృందావనమున తిరోభవించు కాలమువరకు నిర్విరామముగా శ్రమించారు.  *ప్రపంచమంతటా వందలకు పైగా ఆశ్రమాలను, మందిరాలను, సంస్థలను స్థాపించి కృష్ణచైతన్య సంఘాన్ని అంతర్జాతీయ సంస్థగా (ఇస్కాన్ గా) తీర్చిదిద్దారు.*

Plots Lands information

 #Useful_Information

ముఖ్యంగా రైతులకు


1) ఒక ఎకరాకు =  40 గుంటలు 

2) ఒక ఎకరాకు =  4840 Syd

3) ఒక ఎకరాకు =  43,560 Sft

4) ఒక గుంటకు =  121  Syd

5) ఒక గుంటకు =  1089 Sft

6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09చదరపు ఫీట్లు 

7) 121 x 09  =  1089  Sft

8) 4840 Syd x 09 = 43,560 Sft

9) ఒక  సెంట్ కు   =  48.4  Syd 

10) ఒక సెంట్ కు  =  435.6  Sft


*#Land servay* కోసం అత్యవసరమైన information...

Common Terminology  in Revenue Department


*#గ్రామ_కంఠం* :

గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.


*#అసైన్డ్‌భూమి* :

 భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.


*#ఆయకట్టు* :

 ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.


*#బంజరు_భూమి* (బంచరామి) :

 గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.


*#అగ్రహారం* :

 పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.


*#దేవళ్‌_ఇనాం* :

 దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.


*#అడంగల్‌* (పహాణీ) :

 గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

Satya Vara Prasad 

*#తరి* : సాగు భూమి


*#ఖుష్కీ* : మెట్ట ప్రాంతం


*#గెట్టు* : పొలం హద్దు


*#కౌల్దార్‌* : భూమిని కౌలుకు తీసకునేవాడు


*#కమతం* : భూమి విస్తీర్ణం


*#ఇలాకా* : ప్రాంతం


*#ఇనాం* : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి


*#బాలోతా ఇనాం*:

 భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి


*#సర్ఫేఖాస్‌* : నిజాం నవాబు సొంత భూమి


*#సీలింగ్‌* : భూ గరిష్ఠ పరిమితి


*#సర్వే నంబర్‌* : భూముల గుర్తింపు కోసం కేటాయించేది


*#నక్షా* : భూముల వివరాలు తెలిపే చిత్రపటం


*#కబ్జాదార్‌* : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి


*#ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)* :

 భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.


*#ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌* :

 దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.


*#బందోబస్తు* :

 వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.


*#బీ మెమో* :

 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.


*#పోరంబోకు* :

 భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.


*#ఫైసల్‌ పట్టీ* :

 బదిలీ రిజిస్టర్‌


*#చౌఫస్లా*:

 ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.


*#డైగ్లాట్‌* :

 తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.


*#విరాసత్‌/ఫౌతి*:

 భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.


*#కాస్తు* :

 సాగు చేయడం


*#మింజుములే*:

 మొత్తం భూమి.


*#మార్ట్‌గేజ్‌* :

 రుణం కోసం భూమిని కుదవపెట్టడం.


*#మోకా* :

 క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).


*#పట్టాదారు_పాస్‌_పుస్తకం* :

 రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.


*#టైటిల్‌_డీడ్‌*:

 భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.


*#ఆర్వోఆర్‌*(రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :

 భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.


*#ఆర్‌ఎస్సార్‌* :

 రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.


*#పర్మినెంట్‌_రిజిస్టర్‌*:

 సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.


*#సేత్వార్‌* :

 రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.


*#సాదాబైనామా* :

 భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.


*#దస్తావేజు* :

 భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.


*#ఎకరం* :

 భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.


*#అబి* :

 వానకాలం పంట


*#ఆబాది* :

 గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు


*#అసైన్‌మెంట్‌* :

 ప్రత్యేకంగాకేటాయంచిన భూమి


*#శిఖం* :

 చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం


*#బేవార్స్‌* :

 హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.


*#దో_ఫసల్‌*:

 రెండు పంటలు పండే భూమిsvp


*#ఫసలీ* :

 జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.


*#నాలా* :

 వ్యవసాయేతర భూమి


*#ఇస్తిఫా_భూమి* :

 పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి


*#ఇనాం_దస్తర్‌దాన్‌* :

 పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి


*#ఖాస్రాపహానీ* :

 ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.


*#గైరాన్‌* :

 సామాజిక పోరంబోకు


*#యేక్‌రార్‌నామా* :

 ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం....!!