Thursday, April 2, 2020

Think

భగవత్ బందువులరా!
 చిన్న సందేశం అందరికి..
ఇప్పటికైనా ఆలోచించండి !
మరణం మనకు దగ్గరలో ఉంది..
        ఎలా! ఎలా ! అని ఆలోచిస్తున్నారా..
ఒక్కసారి మీ అంతకు మీరు ఆలోచించండి .
మనం అభివృద్ధి అని అంటున్నాం కదా .
ఏమైనది మన అభివృద్ధి?
మనల్ని మనం కాపాడుకోలేని అభివృది ఎందుకు ?.
ఎప్పుడైతే మన ఆచారాలను, కట్టుబాట్లను హేళన చేసి నాస్తిక భావనలోకి వచ్చామో అప్పుడే మొదలయ్యింది మన పతనం..
మన పూర్వికులు మనకు ఇచ్చిన సూచనలు కాదని పాచ్యాత్య సంస్కృతిని ఆచరించాము కదా..
"మన దేశం ఎపుడో చెప్పింది మన భూమి వేద భూమి ,కర్మ భూమి, భారతదేశం లో పుట్టడమే ఒక అదృష్టం లాగా భావిస్తారు.."అలాంటి మన  దేశాన్ని కాదని విదేశాల మోజులో పడి మన సంస్కృతిని నాశనం చేయాలని చూసారు కదా..
"వేరే సంస్కృతి మనల్ని నాశనం చేసింది.." కాదంటారా?

"మత్తు పదార్థాలు మద్యం,మాంసాహారం, వ్యబిచారం, జూదం"లాంటివి
ఎక్కువగా అయ్యాయి కదా ఇంకెందుకు మన పతనం జరగదు..తప్పక జరుగుతుంది.

ప్రకృతి మనకు తల్లి వంటిది..
అలాంటి తల్లికి భూమి మీద ఉన్న ప్రతి జీవి తనకు సంతానమే కదా..

కేవలం మనుషులే అని అనుకుంటే పొరపాటు,
మనకు భూమి మీద ఎంత అధికారం ఉందో మిగతా జీవులకు కూడా అంతే అధికారం ఉంది..

ఒక్కరోజులో ఎన్ని ముగజీవాలను మనము నాశనం చేసి తింటున్నామో ఆలోచించండి..
వాటి బాధ ఎవరికి అర్తం అవుతుంది..
మూగ జీవాలు కదా మనకు అర్తం కాదు వాటి ఘోష కేవలం అమ్మకు మాత్రమే అర్థం అవుతుంది(ప్రకృతికి).
ఆమెకు సంతానం మీద ప్రేమ ఉంది కాబట్టే మనల్ని ఇప్పటివరకు క్షమించింది..
కానీ మనం విచ్చలవిడిగా చేస్తున్న పాపాలకు, మోసాలకు ,కుట్రలకు, కుతంత్రాలకు,... భారతమాత విలవిల్లాడిల్లి పోతుంది.. ఒకప్పుడు ప్రశాంతముగా ఉన్న ప్రకృతి ఇప్పుడు వికారమై పోయింది కేవలం మన స్వార్థం వల్ల కాదంటారా?
భరించలేనంత అయితే ఎవరూ ఊరుకుంటారు కాబట్టే, మనకు తెలిసి రావాలనే ఉద్దేశంతోనే
మనం బయపడుతున్న ఈ వైరస్.. కాదంటారా?

"మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా! ఇప్పుడున్న పరిస్థితికి మనము దేవుణ్ణి నిందించాల్సిన అవసరం లేదు,  ఈ తప్పిదం కేవలం మన వల్లనే జరిగింది" కాదంటారా?
"ఎవరూ చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే ..వారితోపాటే మిగతా వాళ్ళందరూ అనుభవించాల్సిందే.."
ఇప్పటి నుండి అయినా మీ
అందరు మంచి కార్యాలను, ఎదుటివారి సంతోషం ను కోరుకోండి,
మత్తు పదార్థాలు మద్యం,మాంసాహారం, వ్యబిచారం, జూదం లాంటివి వదిలివేయండి..
ఇవి పాపకార్యములు మరియు నరక ద్వారాములు..
మీకు అర్తం అవుతుందనుకుంటాను..
ప్రస్తుతం ఇప్పటికిప్పుడే మన మరణము తధ్యం అంటే ఏమి చేస్తారో ఆలోచించండి..ఒకసారి మీ అంతరాత్మను అడగండి..
మనం ఏ ఏ మంచి కార్యాలు చేసాము అని గుర్తు చేసుకోండి.
మన వల్ల ఎంత మంది నిజముగా సంతోషముగా ఉన్నారో !
మన వల్ల ఎంత మంది ఇబ్బంది పడ్డారో
ఎదుటి వాణ్ణి మనం ఎలా అవమానం చేసామో, కించపరిచామో!
మనం చేసిన పుణ్య కార్యాలు, పాపపు కార్యాలు రాసుకోండి
మనకే తెలుస్తుంది మనము ఏమి చేసాము అని..
ఎవర్ని కించపరచాలనేది మన ఉద్దేశం కాదు..
మరణము తెలుసుకున్న పరీక్షితుడు (7 రోజులలో చనిపోతాడు అని తెలుసుకున్నాక).
శుకదేవ గోస్వామి నుండి 7 రోజుల పాటు భాగవతాన్ని శ్రవణం చేసాడు (రాత్రులు, పగలు)..కేవలం బాగవతాన్ని మాత్రమే శ్రవణం చేసాడు.. ఎందుకంటే అది వినడం వల్ల మనం చేసిన పాపాలు పోయి మనకు మోక్షం
అందరూ భగవంతుని సాన్నిహిత్యాన్ని పొందగలరు మరణానంతరం..
కాబట్టి మరణం ఎప్పుడన్నా ఏ క్షణములో నైన రావచ్చు కాబట్టి
"సాక్షాత్తు భగవంతుడు అయిన శ్రీ కృష్ణ నామాన్ని (హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే) మరియు ఆయన స్వరూపం అయిన శ్రీమద్ భాగవతం చదవండి మరియు అందరికి వినిపించండి"

చాలా విచిత్రం అని అనుకోకండి మిత్రులారా, ఇదే వాస్తవం
"అంతేః నారాయణ స్మృతిః " అని అన్నారు చివరి క్షణములో భగవంతుని నామమే మనల్ని కాపాడుతుంది.. ఎవరూ మనల్ని కాపాడలేరు మన వాళ్ళు, మన తల్లిదండ్రులు, సమాజం, సోదరులు మన భార్య,భర్త,సంతానం ఎవరు మనల్ని కాపాడలేరు.. మన సంపద,సమాజము,దేశం ఎవరూ కాపాడలేరు..
కేవలం భగవంతుని నామమే కాపాడగలదు..
ఇప్పటికైన మేలుకోండి

☘🌹హరే కృష్ణ🌸🌺

🌷అందరూ జపించండి🌷

🌹జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాధి గౌర భక్త బృంద 🌹
(అని ఒక్కసారి చెప్పి)

☘"హరే కృష్ణ హరే కృష్ణ
      కృష్ణ కృష్ణ హరే హరే
      హరే రామ హరే రామ
      రామ రామ హరే హరే"
(108 సార్లు పలకండి)

సంతోషంగా ఉండండి

🍀 🌹🌷🌹
మన సనాతన ధర్మాన్ని ఆచరించుదాం సంతోషంగా ఉందాము
అందరూ బాగుండాలి
హరే కృష్ణ🙏🙇🏻‍♀

No comments:

Post a Comment